- మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరిన మందమర్రి లీడర్లు
కోల్బెల్ట్, వెలుగు: వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. ఆదివారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్లో మంత్రిని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ కాంగ్రెస్ లీడర్లు కలిశారు. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వినాయక నవరాత్రోత్సవాలపై చర్చించారు. మంత్రి ఆధ్వర్యంలో మందమర్రి మార్కెట్లో వినాయక మండలి ఏర్పాటు చేయనున్నారు.
9 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించేలా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ఏర్పాట్లు చేయాలని లీడర్లను మంత్రి ఆదేశించారు. మంత్రిని కలిసినవారిలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ మంద తిరుమల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్, లీడర్లు అర్జున్ మహాతో, పి.నర్సింగ్, గుడ్ల రమేశ్, ఎ.పవన్, ఇషాక్, జావెద్ ఖాన్, కె.సందానందం ఉన్నారు.
